Wednesday, April 16, 2008

మద్య మాంస భక్షణ గురించి.....

మద్య మాంస భక్షణ గురించి.....

గతంలో నేను రాసిన వలసవాదం లో మ్లేచ్చ పద సందర్భంలో మాంస భక్షణ ప్రస్తావన వచ్చింది.మిత్రులు బ్రాహ్మణులు కూడా గోమాంసం తిన్నవారేగా?అని కూడా అన్నారు.కొన్ని ప్రమాణాలు కూడా సూచించారు.వాటిని నేను కనుగొనలేక పోయాను.

ఈ విషయం నా మిత్రులవద్ద చర్చకు వచ్చింది. అందులో ఒక మిత్రుడు అన్నాడు...

"గతంలో బ్రాహ్మణులు మద్యమాంసాలు తిన్నారనడానికి నిదర్శనాలు ఉన్నాయి.
1. శుక్రాచార్యుడు మద్యం తాగిన తర్వాతనే కదా మద్యాన్ని నిషేధించింది? 2. పితృ దైవత కార్యములం దతి భక్తిని మాంసమిడుట ధర్మమనియు...శేషాన్ని ప్రీతిగా తినాలని శాస్త్రాల్లో ఉందనీ.. ధర్మవ్యాధోపాఖ్యానం. (భారతం-ఆధారం)

కాబట్టి మద్యమాంసాలను బ్రాహ్మణులూ తినాల్సిందే".
దానికి నేనన్నాను మిత్రునిగా నన్ను తినేట్టుగా చెయ్యాలనుకుంటే అది వేరు కాని... సిద్ధాంతాన్ని అందరికీ అంతగట్టడం ఎందుకు? అని...

5 comments:

రానారె said...

అందరికీ అంటగడితేనే కదండీ సిద్ధాతమనిపించుకొంటుంది! :-)

ఏదేమైనా విశాలహృదయంతో ఈ విషయాన్ని టపాకట్టి అందించినందుకు మీకు వందనాలు.

chandramouli said...

meeku vupayogapadutundemo ani ikkada raastunnaanu...

www.theuntoldhistory.blogspot.com

ee bloglo chala post lo puranala perlu, verse no to saha pondu paracharu.. meeku vupayoga padutundemo choodandi.....

Dr.Pandu Ranga Sharma Ramaka said...

నిజమే, మీరు చెప్పినట్లు..శ్రీధర్ గారి ఆ బ్లాగు చాల అద్భుతంగా ఉంటుంది.శ్రీధర్ గారు చక్కని విశ్లేషకులు.ఎన్నో విషయాలను సునిశితంగా పరిశీలించి రాస్తారు.

RSG said...

అగస్త్యుడు వాతాపిని భుజించిన ఉదంతం కూడా... ఒక ఉదాహరణ... :)

Dr.Pandu Ranga Sharma Ramaka said...

నిజమే.ఇటువంటివి ఇంకేమైనా ఉన్నాయో?